సింగపూర్‌లో రోడ్డు ప్రమాదం | Road accident in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో రోడ్డు ప్రమాదం

Jun 12 2015 11:30 PM | Updated on Aug 30 2018 3:58 PM

బతుకు తెరువు కోసం సింగపూర్ వెళ్లిన పొత్రకొండ గ్రామానికి చెందిన ఉదియాన శంకర్ (24) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

 సోంపేట: బతుకు తెరువు కోసం సింగపూర్ వెళ్లిన పొత్రకొండ గ్రామానికి చెందిన ఉదియాన శంకర్ (24) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. తొమ్మిది సంవత్సరాలుగా శంకర్ సింగపూర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం చివరిసారిగా పొత్రకొండ గ్రామం వచ్చి తిరిగి అక్కడకు వెళ్లాడు. గురువారం సాయంకాలం తను పని చేస్తున్న కంపెనీలో విధులు ముగించుకొని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ల కంటైనర్ ఢీకొట్టడంతో శంకర్ చనిపోయినట్టు సమాచారం వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు శ్యామసుందర్, రత్నాలు, భార్య దేవి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశతో అంత దూరం వెళ్లాడని, రోడ్డు ప్రమాదంలో చనిపోయి తమకు అన్యాయం చేశాడని కన్నీరు మున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement