ప్రకాశం, యర్రగొండపాలెం: విషజ్వరాలతో (వైరల్ఫీవర్స్) మండలంలోని గడ్డమీదిపల్లె మంచంపట్టింది. వీరభద్రాపురం పంచాయతీలోని ఈ గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా చోటు చేసుకోవడం వలన అంటువ్యాధులు సోకుతున్నాయి. పంట పొలాలు గ్రామానికి సమీపంలో ఉండటంతో గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్నాయి. వైద్యాధికారులు సీజనల్ వ్యాధులపై ప్రత్యేదృష్టి పెట్టి గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేస్తున్నారు. జ్వరాలు సోకిన వారి ఇంటివద్దనే సెలైన్ బాటిళ్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్డమీదిపల్లెలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి.సురేష్ బుధవారం తమ సిబ్బందితో వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. 110 మందిని ఆయన పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. 10 మందికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. గ్రామంలో వైద్యబృదం పర్యటించి కాలువల్లో, గుంతల్లో నిలువ ఉన్న మురికి నీటిలో ఎబేట్ పిచికారి చేయించారు.
'బెడ్డు'మీదపల్లె
Published Thu, Sep 12 2019 12:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement