చివరి మజిలీలోనూ విషాదమే

People Fear on Funeral Program in East Godavari - Sakshi

తూర్పుగోదావరి, మామిడికుదురు: కరోనా మహమ్మారి భయంతో శవ పేటిక మోయడానికి ఆ నలుగురే మిగిలారు. వెనుక వచ్చేవారే కరువయ్యారు. మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన బొరుసు ఆదిలక్ష్మి పదేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆదిలక్ష్మి మృతదేహాన్ని బాక్సులో పెట్టి కేవలం ఆమె కుటుంబ సభ్యులు నలుగురు మాత్రమే మోసుకు వెళ్లి స్థానిక వైనతేయ గోదావరి నది ఒడ్డున ఖననం చేశారు. కనీసం శ్మశాన వాటిక వరకు కూడా పట్టుమని పది మంది కూడా రాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top