పాస్‌పోర్ట్‌ నిబంధనలు ఇక సరళతరం | Passport terms are more flexible | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ నిబంధనలు ఇక సరళతరం

Dec 26 2017 2:49 AM | Updated on Dec 26 2017 2:49 AM

Passport terms are more flexible - Sakshi

సాక్షి, అమరావతి: పాస్‌పోర్టు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇప్పటివరకూ జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా పంచాయతీ లేదా మున్సిపాలి టీలు ఇచ్చిన పత్రాలు మాత్రమే చెల్లుబాటయ్యేది. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్, ఓటర్‌ కార్డుల్లోని పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యాభర్తలు విడాకులకు దరఖాస్తు చేసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా సడలించారు. ఇప్పటికే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

తాజా మార్గదర్శకాల ప్రకారం
  ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకూ ఎన్‌వోసీ ఇవ్వవలసి వచ్చేది. ఇకపై తమ సర్వీసు రికార్డును చూపిస్తే సరిపోతుంది. పెన్షనర్లు అయితే పెన్షన్‌ పొందుతున్న వివరాలు ఇస్తే చాలు.
టీసీ (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌), పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డుల్లో ఏవైనా రెండు ఉంటే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
  అనాథ పిల్లలు దరఖాస్తుకు అనాథ శరణాలయం లేఖ ఇస్తే సరిపోతుంది. లేదా శిశుసంరక్షణ సంస్థ తమ లెటర్‌హెడ్‌పైన వివరాలు రాసి ఇస్తే అనుమతిస్తారు.
  వివాహం అయిన మహిళ దరఖాస్తు చేసుకోవాలంటే మ్యారేజీ సర్టిఫికెట్‌ అక్కర్లేదు. భాగస్వామి పేరు రాస్తే సరిపోతుంది.
విడాకులు తీసుకున్న వారు కోర్టు ధ్రువీకరించిన పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.  
సాధువులు, సన్యాసులు తమ గురువు పేరు రాసి దరఖాస్తు చేసుకోవచ్చు.
తల్లీబిడ్డలు సమ్మతిస్తే భర్త పేరు రాయాల్సిన అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement