రెండు లారీలు ఢీ: ఒకరు మృతి | One killed in Lorry accident in ysr kadapa district | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ: ఒకరు మృతి

May 14 2015 8:40 AM | Updated on Aug 25 2018 5:39 PM

వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు బైపాస్ రహదారిపై గురువారం రెండు లారీలు ఢీ కొన్నాయి.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు బైపాస్ రహదారిపై గురువారం రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కడపలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement