
జడ్పీ సీఈవోగా పద్మ
జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా కె.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ సిటీ : జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా కె.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె గతంలో 2013 నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జడ్పీ ఇన్చార్జ్ సీఈవోగా పనిచేసారు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. 1995 డిప్యూటీ తహశీల్దార్ బ్యాచ్కి చెందిన ఆమె జిల్లాలో వివిధ మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ కేడర్లలో పనిచేసారు. డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి వచ్చిన తర్వాత డీఆర్డీఏ అదనపు పీడీగానూ, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ల్యాండ్ అక్విజేషన్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసారు.