ఆరోగ్య కేంద్రాలకు నిధుల పెంపు
‘సాక్షి’తో డీఎంహెచ్ఓ డాక్టర్ నాగ మల్లేశ్వరి
గుంటూరు మెడికల్ జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూసి మాతా, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా ైవె ద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రస్తుతం కాన్పులు జరుగుతున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలూ పనిచేసే 32 ఆస్పత్రులలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు, వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాల వివరాలన్నీ సేకరించి, మెరుగైన వైద్యసేవలందించడానికి నివేదిక రూపొందించామన్నారు. సురక్షితమైన కాన్పులు జరిగేలా వినుకొండ, గురజాల ఆస్పత్రుల స్థాయిని పెంపుదల చేశామని, వాటి అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్టు చెప్పారు. పీహెచ్సీలకు జాతీయగ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులను ఇకనుంచి ఏడాదికి రూ.2.50లక్షలు ఇస్తామని వెల్లడించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజ్, బ్లడ్గ్రూప్, బ్లడ్ షుగర్, యూరిన్ పరీక్షలు, గర్భ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. ల్యాట్ టెక్నీషియన్లు లేని ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.
గ్రామాలకు 104 వాహనాలు వెళ్లిన సమయంలో ఆరోగ్య కేంద్రాల్లో చేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ వాహనంలో ఉండే ల్యాబ్ టెక్నీషియన్లు చేస్తారని తెలిపారు. గర్భిణులకు చేసే అన్ని పరీక్షలను వారికి ఇచ్చే మాతా,శిశు సంరక్షణ కార్డులో తప్పనిసరిగా న మోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు డాక్టర్ నాగమల్లేశ్వరి చెప్పారు. గర్భవతిగా నిర్ధారణ జరిగిన వారి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించే పారితోషికాలను చెల్లించేందుకు వారి ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని తెలిపారు.
మాతా,శిశు మరణాల తగ్గింపే లక్ష్యం
Published Sat, Oct 25 2014 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement