అన్ని ప్రాంతాల అభివృద్ధే జగన్‌ సంకల్పం

Minister Avanthi Srinivas Comments On Chandrababu - Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, నెల్లూరు: రాజధాని విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై టీడీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అమరావతిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో కలిసి రాజధానిపై ప్రకటన చేయించాలని సవాల్‌ విసిరారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top