అలంపురం (పెంటపాడు) : అలంపురం వద్ద జాతీయ రహదారి గురువారం నెత్తురోడింది. కూలీలతో వెళుతున్న ఆటో రోడ్డు పక్కన ఆగి ఉండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, ఐదుగురు మహిళలు, ఆటోడ్రైవర్ సహా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెంకు చెందిన మేస్త్రి సహా 12 మంది వ్యవసాయ కూలీలు తణుకు మండలం దువ్వలో వరి కోత పనుల నిమిత్తం గురువారం ఉదయం ఆటోలో గ్రామం నుంచి బయలుదేరారు. జాతీయరహదారి మీదుగా వెళుతూ అలంపురం వద్ద బంక్లో పెట్రోలు పోయించి తిరిగి బయలుదేరారు.
ఆటో రోడ్డుపైకి వచ్చిన తరువాత బంక్ సిబ్బంది నుంచి చిల్లర తీసుకోవడం మరిచిపోయానని ఆటోడ్రైవర్ జంజులూరి సతీష్కు గుర్తుకొచ్చింది. దీంతో ఆటోను రోడ్డుపై నిలిపి చిల్లర తెచ్చుకునేందుకు మేస్త్రి చలపటి సత్యనారాయణతో కలిసి బంక్లోకి వెళ్లాడు. తిరిగి వారు ఆటో వద్దకు వస్తుండగా, అదే సమయంలో విజయవాడ నుంచి తణుకు వైపు వెళుతున్న కారు ఈ ఆటోను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి రోడ్డు డివైడర్దాటి అవతలి వైపునకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మైలవరపు సత్యనారాయణ (38), చలపాటి వెంకట్రావు (45) తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.
వీరిని గూడెం ఏరియా ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన కూలీలు గొడిగిన వరలక్ష్మికి తల, ముఖంపై, చలపాటి పద్మకు తల, చేతులకు, బొల్లబాల నాగమ్మకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే పామర్తి శ్రీనివాస్, ఆరుగొలను శ్రీనివాస్, తిరుపతి నాగేశ్వరరావు, పసుపులేటి సత్యవతి, కొనకళ్ల వెంకటేశ్వరరావు, పెదముత్తి జీవిత, ఆటోడ్రైవర్ జంజులూరి సతీష్లకు తీవ్రగాయలపాలై తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా మేస్త్రి అయిన చలపటి సత్యనారాయణ స్వల్పగాయాలు అయ్యాయి. కాగా మరో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు కాగా, అతను చికిత్స నిమిత్తం వేరే వాహనంలో వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. స్థానికులు కొందరు వెంటనే స్పందించి బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పెంటపాడు ఎస్సై సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలీల ఆటోను ఢీకొట్టిన కారు
Published Fri, Nov 28 2014 3:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement