విశాఖపట్నం, న్యూస్లైన్ : ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆధునాతన బోగీలతో కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. మంగళవారం ఉదయం సరిగ్గా 7.45 గంటలకు ఒకటి, 8 గంటలకు మరో రైలు పరుగులు తీశాయి. విశాఖ-జోధ్పూర్, విశాఖ-గాంధీధాం ఎక్స్ప్రెస్ రైళ్లను కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. పాత-కొత్త బోగీలను కలపాలని ముందు భావించినా జోన్ సాధన సమితి సభ్యులు ఆందోళన చేస్తారేమోనని తక్కువ బోగీలతోనైనా ప్రారంభించారు. కేవలం13 బోగీలతోనే సర్దుబాటు చేశారు.
కొత్త రైళ్ల ప్రారంభం పై గుజరాత్ సమాజ్ సభ్యులు హర్షం ప్రకటించి ప్రయాణికులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కాగా కొత్త రైళ్లలో ప్రయాణికులు స్వల్పంగానే ఉన్నారు. విశాఖ-జోధ్పూర్లో 365 మంది.. విశాఖ-గాంధీధాంలో 146 మంది మాత్రమే పయనమయ్యారు. వీరంతా అప్పటికప్పుడే బయల్దేరిన వారు కావడంతో రైల్లోనే రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
కొత్త రైళ్ల ప్రారంభం సందర్భంగా కొందరు జైనులు, మార్వాడీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కొత్త రైలు లేక గుజరాత్ వెళ్లేందుకు నానా పాట్లు పడేవారు. చెన్నై వెళ్లి అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ కోసం ప్రదక్షిణలు చేసేవారు. రెండు మూడు రోజుల పాటు నిరీక్షించినా ఆ రైల్లో చోటు లభ్యమయ్యేది కాదు. ఇప్పుడా బాధ తప్పిందని సురేష్ జైన్ అనే వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు.
సమోసాలు తింటూ కులాసాగా ప్రయాణం...
విశాఖపట్నం-జోధ్పూర్ రైలు సమోసాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు మీదుగా ప్రయాణిస్తుంది. భిలాస్పూర్కు అతి సమీపంలో వున్న పెండ్రారోడ్ స్టేషన్ అంటేనే నోరూరించే సమోసాలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అందుకే ఈ రైల్లో కొందరు జోధ్పూర్ వాసులు సమోసాలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
సంబరాల నడుమ కొత్త రైళ్ల పరుగులు
Published Wed, Dec 25 2013 2:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement