చట్టసభల్లో చేసిన ప్రకటనలను అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చే అధికారం తమకు ఎక్కడ ఉందో చూపాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ను అడిగింది.
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో చేసిన ప్రకటనలను అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చే అధికారం తమకు ఎక్కడ ఉందో చూపాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ను అడిగింది. అధికారం ఉందని చూపించడంతో పాటు వాదనలతో తమను సంతృప్తిపరిస్తే తప్పకుండా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని పేర్కొంది. లోతుగా అధ్యయనం చేసి న్యాయస్థానానికి సహకరించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ను ఆదేశించాలని, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ వేగంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది.