42 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఉదయం నుంచే వేడి గాలులు అర్ధరాత్రి దాటినాతగ్గని తీరు
భారీగా పెరిగిన వడదెబ్బ మృతుల సంఖ్య
బయటికి రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం
జిల్లాలో వడగాలులు వణికిస్తున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజులుగా వడదెబ్బకు గురై మృతిచెందుతున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పగటివేళ బయటికి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రోహిణీ వెళ్లిపోయింది.. ఇక వాతావరణం చల్లబడుతుందని ఆశించినవారికి అడియాసే ఎదురైంది. మృగశిర కార్తె ప్రవేశించినా ఎండలు తగ్గకపోగా.. వాటికి వడగాలులు తోడయ్యాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. జూన్ 17వ తేదీ వచ్చినా రుతుపవనాల జాడ లేకపోవడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
మచిలీపట్నం : గత వారం రోజులుగా జిల్లాలో సగటున 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచే వడగాలులు ప్రారంభమవుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యమైన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల పాటు కోస్తా తీరంలో ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతాయని విశాఖపట్నం రాడార్ కేంద్రం అధికారి నరసింహారావు తెలిపారు. రుతుపవనాలు బాపట్ల, నంద్యాల వరకు వచ్చాయని చెప్పారు. కోస్తా తీరంలో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందన్నారు. దీనికి తోడు ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తా తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉందని, దీంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని ఆయన తెలిపారు.
క్యూములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ వర్షాలు నమోదైనా సముద్రతీరం వెంబడి వేడిగాలులు వీస్తున్నాయన్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో జిల్లాలో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వడగాలుల తీవ్రత అధికమైతే ఒంటిపూట బడులను కొనసాగించాలని ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. వడగాలుల కారణంగా జనం బయటికి రావడానికి భయపడుతున్నారని, దీంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
వణికిస్తున్న వడగాలులు
Published Wed, Jun 18 2014 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement