శ్రీశైలం చేరిన బంగారు రేకులు | Gold reached to Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం చేరిన బంగారు రేకులు

Dec 14 2013 1:02 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం చేరిన బంగారు రేకులు - Sakshi

శ్రీశైలం చేరిన బంగారు రేకులు

శ్రీశైల భ్రమరాంబాదేవి గర్భాలయ విమాన గోపుర శిఖరానికి సంబంధించిన బంగారు రేకులు శుక్రవారం ఆలయ ప్రాంగణం చేరాయి.

శ్రీశైల భ్రమరాంబాదేవి గర్భాలయ విమాన గోపుర శిఖరానికి సంబంధించిన బంగారు రేకులు శుక్రవారం ఆలయ ప్రాంగణం చేరాయి. కొన్నేళ్లుగా అమ్మవారి గర్భాలయ సువర్ణకవచ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈఓ చంద్రశేఖర్‌ఆజాద్ టీటీడీ బాధ్యులతో చర్చించారు. గత అక్టోబర్ 14 నుంచి పనులు వేగవంతంగా కాగా ఇప్పటి వరకు గోపుర విమాన కంఠ భాగం వరకు పనులు పూర్తయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ బంగారు రేకుల తాపడం పనులు జరిగాయని ఈఓ తెలిపారు.  విమాన గోపుర శిఖర బంగారు రేకులకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement