అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
కోరుకొండ: అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. నిందితుల నుంచి రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.