విమానంలో మంటలు | fire accident happen in-flight | Sakshi
Sakshi News home page

విమానంలో మంటలు

Oct 3 2014 12:40 AM | Updated on Sep 4 2018 5:15 PM

కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ మీదుగా న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి గురువారం పెనుప్రమాదం తప్పింది.

బెంబేలెత్తిన 64 మంది ప్రయాణికులు

గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ మీదుగా న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి గురువారం పెనుప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం కుడి వైపున పెద్ద శబ్దం, మంటలు రావడంతో పాటు భారీ కుదుపులకు గురైంది. సకాలంలో సమస్యను గుర్తించిన పెలైట్లు టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే విమానాన్ని తిరిగి రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలోని 64 మంది ప్రయాణికులు తొలుత ఆందోళన చెందినా ప్రమాదం తప్పడంతో కుదుట పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement