పత్తికొండలో యువ రైతు ఆత్మహత్య | farmer commits suicide in pattikonda at kurnool district | Sakshi
Sakshi News home page

పత్తికొండలో యువ రైతు ఆత్మహత్య

Nov 27 2017 11:38 AM | Updated on Nov 6 2018 8:08 PM

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాక్షి, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తికొండకు చెందిన బారిక వీరేంద్ర(32) కు నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. మరో పదెకరాలు కౌలుకు తీసుకుని టమాటా, వేరుశనగ సాగుచేస్తున్నాడు.

అయితే ఆదివారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వీరేంద్ర అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇతనికి రూ. 4 లక్షల అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement