తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! | Devotess rush continues in Tirumala Pilgrim | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

Dec 26 2013 7:59 PM | Updated on Aug 28 2018 5:55 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! - Sakshi

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

తిరుమల పుణ్యక్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో వేచివున్నారు.

తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో వేచివున్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 9 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహకులు తెలిపారు.

కాగా, మధ్యాహ్నం నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. ఇప్పటి వరకు స్వామివారిని 43,800 మంది భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారి దర్శనం కోసం క్యూలో మరో 50 వేల మంది భక్తులు నిలబడినట్టు టీటీడీ నిర్వహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement