దంపతుల అనుమానాస్పద మృతి | couple suspicious death in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

దంపతుల అనుమానాస్పద మృతి

Mar 31 2015 10:29 AM | Updated on Sep 2 2017 11:38 PM

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం గుర్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దమరసింగ గ్రామానికి చెందిన రామారావు, గౌరీలకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి  సిద్దూ(7), సౌమ్య(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే రామారావు, గౌరీల మృతదేహాలు వారి ఇంటి సమీపంలో ఉన్న బావిలో మంగళవారం ఉదయం కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(గుర్ల)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement