శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా సభ్యులు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన
జవాబు చెప్పాల్సిన సమయానికి సభలో లేని మంత్రి సుజాత
సాక్షి, అమరావతి: శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా సభ్యులు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన సమయానికి మంత్రి పీతల సుజాత అందుబాటులో లేకుండాపోయారు. దీంతో మంత్రి తీరుపై మండలి చైర్మన్ చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో గనుల తవ్వకానికి సంబంధించిన అంశంపై టీడీపీ సభ్యుడు గౌనివారి శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు మంత్రి సుజాత సమాధానం చెప్పాల్సి ఉంది.
అయితే ఆ సమయంలో మంత్రి సభలో లేకపోవడంతో ఎవరు జవాబు చెబుతారంటూ చైర్మన్ ఇతర మంత్రులను ప్రశ్నించారు. అనంతరం సంబంధిత ప్రశ్నను తాత్కాలికంగా వాయిదా వేసి వేరొక ప్రశ్నను చర్చకు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత సభకు వచ్చిన మంత్రి పీతల సుజాత సభకు క్షమాపణ చెప్పారు.