Minister peethala Sujata
-
మంత్రి తీరుపై మండలి చైర్మన్ ఆగ్రహం
జవాబు చెప్పాల్సిన సమయానికి సభలో లేని మంత్రి సుజాత సాక్షి, అమరావతి: శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా సభ్యులు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన సమయానికి మంత్రి పీతల సుజాత అందుబాటులో లేకుండాపోయారు. దీంతో మంత్రి తీరుపై మండలి చైర్మన్ చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో గనుల తవ్వకానికి సంబంధించిన అంశంపై టీడీపీ సభ్యుడు గౌనివారి శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు మంత్రి సుజాత సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో మంత్రి సభలో లేకపోవడంతో ఎవరు జవాబు చెబుతారంటూ చైర్మన్ ఇతర మంత్రులను ప్రశ్నించారు. అనంతరం సంబంధిత ప్రశ్నను తాత్కాలికంగా వాయిదా వేసి వేరొక ప్రశ్నను చర్చకు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత సభకు వచ్చిన మంత్రి పీతల సుజాత సభకు క్షమాపణ చెప్పారు. -
స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా
ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదలం: సీఎం సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని, దీనిని దెబ్బతీయాలని చూసేవారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్, విపక్ష సభ్యులు అసెంబ్లీలో విమర్శనాస్త్రాలు సంధించడంతోదీనిపై సీఎం మాట్లాడారు. ‘మొదట డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ఇసుకను రెగ్యులరైజ్ చేయాలని ప్రయత్నించాం. వారు సరిగా చేయలేకపోవడంతో అన్నీ ఆలోచించి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. తప్పులుంటే సలహాలిస్తే సరిదిద్దుకుంటాం. ఇసుకను సరిహద్దులు దాటించాలని ఎవరు ప్రయత్నించినా పీడీ చట్టం కింద కేసులు పెడతాం. డ్రైవర్ పైనే కాదు వాహన యజమానిపైనా కేసులు నమోదు చేస్తాం. రాష్ట్రంలో 491 ఇసుక రేవులకు పర్యావరణ అనుమతులు తీసుకుని ప్రజలు ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించాం. ఇంకా ఎవరికైనా దగ్గర రీచ్లు ఉంటే వినియోగించుకోవచ్చు. కాల్ సెంటర్ కూడా పెట్టాం. పొలాల్లో ఇసుక ఉంటే తవ్వకం ఖర్చులు మాత్రమే తీసుకుని డిస్పోజ్ చేయాలి. ధరలు పెట్టి అమ్మరాదు. గతంలో తెలిసో, తెలియకో తప్పు చేసినా ఇక ఇసుక దందా మానేయండి. లేదంటే కఠిన శిక్షలు తప్పవని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఇసుక వ్యవహారాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ఉచిత ఇసుక ప్రజల హక్కు. ఎవరైనా డబ్బు అడిగితే మీరు వారిని రెండు దెబ్బలు కొట్టడానికి కూడా భయపడవద్దు. కేసులు పెట్టం. పైసా అవినీతి జరిగినా సహించే ప్రసక్తే లేదు’ అని చంద్రబాబు తెలిపారు. అక్రమాలను చంద్రబాబు కంటిచూపుతో చంపేస్తారు: మంత్రి పీతల కాగా అంతకుముందు మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. కంటిచూపుతోనే అక్రమాలను చంద్రబాబు చంపేస్తారని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఇసుక సరఫరా చేసే సమయంలో ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు జరిపిన వారిపై 5,565 కేసులు పెట్టామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
అబ్బే.. ఏమీ జరగలేదట!
-
అబ్బే.. ఏమీ జరగలేదట!
* పీతల ఇంట్లో నోట్ల కట్టల కేసు కొట్టేసిన పోలీసులు * మంత్రికి సంబంధం లేదన్న డీఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఊహించిందే జరిగింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం, సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబేనని టి.మంత్రులు చెబుతున్న నేపథ్యంలో.. మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల సంచి ఉదంతం చోటు చేసుకోవడం.. ఏపీ ప్రభుత్వ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కనీసం ఈ కేసు నుంచైనా బయటపడి పోయిన పరువును కాస్తై కాపాడుకోవాలనే పథకం వేశారు. అంతే.. అసలేం జరగలేదనీ, నోట్ల కట్టలకు.. మంత్రికీ సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని, కేసును క్లోజ్ చేశామని నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత శుక్రవారం చెప్పారు. ఈ వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదని, ఆమె ఇంటివద్ద డబ్బు సంచి వదిలివెళ్లిన ఆదాల విష్ణువతి కూడా అమాయకురాలేనని తేలిందన్నారు. ఇక మంత్రి తండ్రి డబ్బులు తీసుకుంటుండగా సెల్ఫోన్తో వీడియో తీశారన్న దానిపైనా విచారణ చేపట్టామని డీఎస్పీ చెప్పారు. కొన్ని రోజుల క్రితం మంత్రి తండ్రి ఏలూరులో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొందరు సెల్ఫోన్తో వీడియో తీశారనే వదంతులు ఉన్నాయని చెప్పారు. అయితే, రూ.10 లక్షల బ్యాగ్ వ్యవహారానికి, దానికి సంబంధం లేదన్నారు.