టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు... | Congress MLCs today join TDP, says CM Ramesh | Sakshi
Sakshi News home page

టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు...

Jun 21 2014 1:35 PM | Updated on Mar 18 2019 7:55 PM

టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు... - Sakshi

టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరనున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరనున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో సీఎం రమేష్ మాట్లాడుతూ... వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు.

 

తమ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్సీలు షేక్ హుస్సేన్, రెడ్డప్పరెడ్డి, చైతన్యరాజు, రవికిరణ్ వర్మ, బచ్చులు పుల్లయ్య, శ్రీనివాసుల నాయుడు, ఐలాపురం వెంకయ్యలు ఈ రోజు సాయంత్రం 6.00 గంటలకు తమ పార్టీలో చేరతారన్నారు. శాసన మండలిలో టీడీపీకి కేవలం ఏడుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అయితే శాసన మండలి అధ్యక్ష పదవిని కైవసం చేసుకునే క్రమంలో టీడీపీ.... పలువురు ఎమ్మెల్సీలకు గాలం చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, ఇందిరలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement