
పవన్ కల్యాణ్ 'జనసేన'పై పోలీసులకు ఫిర్యాదు
సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో్ 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటో పెట్టారని ఆరోపించారు.
మహాత్మా గాంధీని కించపరచారని, చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. కాగా జనసేన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావాల్సివుంది.