సాక్షి, కాకినాడ :జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాలోనే కొనసాగాలన్న ఆమె ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీల్లేకుండా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో దార్లన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తోంది. రాష్ర్ట విభజనతో నీతూప్రసాద్ తొలుత తెలంగాణ ను ఎంచుకున్నారు. ఇంతలో ఆమె భర్త, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్కుమార్ను గుంటూరు అర్బన్ఎస్పీగా బదిలీ చేయడంతో పాటు ఏపీలోనే కొనసాగాలన్న రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడితో తెలంగాణ విషయంలో ఆమె పునరాలోచనలో పడ్డారు. దీనికి తోడు రాజేష్కుమార్ కూడా ఏపీలోనే కొనసాగేందుకు మొగ్గడంతో తాను కూడా ఇక్కడే ఉండి పోవాలని ఆశించారు.
ఏపీలో కొనసాగితే కృష్ణా లేదా గుంటూరు జిల్లాకు బదిలీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా ఆమెకు హామీ లభించింది. ఏపీ ప్రభుత్వం అభిలాష మేరకు ఇక్కడే కొనసాగితే కోరుకున్న పోస్టింగ్ను దక్కించుకోవడంతో పాటు మంచి గుర్తింపు పొందవచ్చన్న ఆలోచనతో ఏపీ కేడర్లోనే కొనసాగాలని నీతూప్రసాద్ భావించారు. స్పౌజ్ ఆప్షన్ (భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసే వెసులుబాటు)ను ఉపయోగించుకుని ఏపీ లోనే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కేంద్రానికి ఆప్షన్ కూడా పెట్టుకున్నారు. అయితే ఆమె అభ్యర్థనను ఐఏఎస్ల పంపిణీ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన సిన్హా కమిటీ తోసిపుచ్చింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ఎలు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చేసింది. అందుకనుగుణంగానే కేంద్రం ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్లు ఆ రాష్ట్రానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
12 లోగా జాబితాలకు ఆమోదముద్ర
అంతేకాక ఐఏఎస్లు వారి అభ్యంతరాలతో వేసే పిటిషన్లను స్వీకరించవద్దంటూ ముందస్తుగా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషనూ దాఖలు చేసింది. దీంతో నీతూ ప్రసాద్ తెలంగాణ కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈనెల 12 లోగా ఇరురాష్ట్రాలకు కేటాయించిన ఐఏఎస్ఎల జాబితాలకు కేంద్రం ఆమోదముద్ర వేయనుంది.
వ్యక్తిగతంగా వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకున్నా రాష్ర్టప్రభుత్వాల ఒత్తిడి మేరకు ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. నీతూప్రసాద్ విషయంలో ఏపీ సర్కార్ నుంచి ఒత్తిడి వస్తే కేంద్రం మార్పు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇరు రాష్ట్రాలకు అధికారుల కేటాయింపులు జరిపినా ఒక రాష్ర్ట కేడర్తో విధుల్లో చేరి డిప్యుటేషన్పై మరొక రాష్ర్టంలో విధులు నిర్వర్తించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. నీతూప్రసాద్ను రాష్ర్టంలోనే కొనసాగించాలని పట్టుదలతో ఉన్న జిల్లాకు చెందిన మంత్రి ఈ మేరకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.
ఇక వెళ్లక తప్పదు..!
Published Thu, Sep 4 2014 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement