ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి , రాజధాని ప్రాంత సవరణ బిల్లు (సీఆర్డీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి , రాజధాని ప్రాంత సవరణ బిల్లు (సీఆర్డీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ బిల్లు ప్రవేశపెడతారని అజెండాలో ప్రకటించినా... ఆయన సభలో లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రవేశపెట్టారు. మొత్తం మూడు సవరణల్ని ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. బడ్జెట్పై చర్చ తర్వాత ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.