సంయుక్త ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు.
ఢిల్లీ: సంయుక్త ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పార్టీ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పర్యటించాల్సిందిగా బొత్స సత్యనారాయణ రాహుల్ గాంధీని కోరారు.
ఇదిలావుండగా, తెలంగాణకి చెందిన ఎమ్మెల్సీలు డీ శ్రీనివాస్, షబ్బీర్ అలీలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్తో ఇదే రోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ స్థానం రెన్యువల్ విషయమై హైకమాండ్తో డీఎస్ చర్చించారు.