'చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశా' | bandaru dattatreya meets chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశా'

Nov 23 2014 11:51 AM | Updated on Jul 28 2018 6:33 PM

'చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశా' - Sakshi

'చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశా'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని మర్యాద పూర్వకంగా కలిశానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని మర్యాద పూర్వకంగా కలిశానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మిక ఉపాధి శాఖకు సంబంధించిన పలు అంశాలను చంద్రబాబుతో చర్చించినట్లు దత్తాత్రేయ తెలిపారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని బాబు కోరారని.. తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి దత్తాత్రేయను చంద్రబాబును సన్మానించినట్లు టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. సభలో టీడీపీ గొంతు నొక్కడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం స్పీకర్ ను కలిసి సభలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. గతంలో ఇదే అంశంపై స్పీకర్ ను ఫిరాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement