పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన అడ్వాన్సులు | AP Sarkar issued the order for the tenth PRC advances | Sakshi
Sakshi News home page

పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన అడ్వాన్సులు

Sep 21 2017 3:04 AM | Updated on Aug 18 2018 8:49 PM

పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమల్లోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ అడ్వాన్సులను పెంచింది.

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌

సాక్షి, అమరావతి:  పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమల్లోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ అడ్వాన్సులను పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారు, బైక్, మోపెడ్, సైకిల్, కంప్యూటర్‌ కొనుగోలు, వివాహానికి, విద్యా సంబంధిత, పండుగ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి అడ్వాన్స్‌ తీసుకుని వాయిదాల పద్ధతిలో రుణం తీర్చవచ్చు. కారు కొనుగోలు కోసం రూ.27,700కు పైగా నెలసరి వేతనమున్న ఉద్యోగులు.. 15 నెలల మూల వేతనం లేదా రూ.4.50 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకో వచ్చు. అదే రూ.37,000కు పైగా నెలసరి వేతనమున్న అధికారులు 15 నెలల మూల వేతనం లేదా రూ.6 లక్షలను అడ్వాన్స్‌గా పొందవచ్చు. మిగిలిన వాటికి కూడా ఇలాగే అడ్వాన్స్‌ మొత్తాలు పెరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement