ప్రత్యేక విమానం ద్వారా సోమవారం సాయంత్రం హస్తిన చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు.
రెండు రోజుల పర్యటన కోసం ప్రత్యేక విమానం ద్వారా సోమవారం సాయంత్రం హస్తిన చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారాలతోపాటు ఇరుపార్టీల మధ్య సమస్వయం అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.