32 ఎక్స్ ప్రెస్ రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు | another 32 coaches to be held in express trains | Sakshi
Sakshi News home page

32 ఎక్స్ ప్రెస్ రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

Sep 21 2014 8:26 PM | Updated on Jul 29 2019 6:03 PM

దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.

హైదరాబాద్:దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రత్యేక  ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. అదనంగా ఎక్స్ ప్రెస్ రైళ్లలో 32 అదనపు బోగీల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో 19, 224 బెర్తులు అందుబాటులోకి రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం, చెన్నై, బెంగళూర్, షిర్డీ, యశ్వంత్ పూర్ వెళ్లే రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు కసరత్తులు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement