కర్నూలు జిల్లా లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు దొంగల అరెస్ట్.. బంగారం స్వాధీనం
Jan 23 2016 2:05 PM | Updated on Aug 20 2018 4:27 PM
సిరివెల్ల : కర్నూలు జిల్లా లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ఈశ్వర్రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. జిల్లాలోని సిరివెల్ల మండల కేంద్రానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి ఇంట్లో గతనెల 1న చోరీ జరిగింది. 99 తులాల బంగారం, 130 తులాల వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను సిరివెల్లలో శనివారం పట్టుబడ్డారు. వారి నుంచి 37 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement