Top Stories
ప్రధాన వార్తలు
ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులు: చలసాని శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు. ‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు.
ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్కు మంగేష్ పన్హాల్కర్కు ఫోన్కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.
‘నీట్’ అక్రమాలు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఆదివారం(జూన్16) కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నీట్ వ్యవహారంపై స్పందించాలన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేసి వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. … pic.twitter.com/agUwEuiaG8— BRS Party (@BRSparty) June 16, 2024 కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.నీళ్ల కోసం ‘‘క్యూ సెరా.. సెరా’’భారతదేశంలో రాజకీయ విజయం అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వాస్తవ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గురించి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. Political success in India is no more about the ability to solve real issues like water, electricity, roads, jobs and prices of essential commodities etc Where is the incentive for political parties to work on these real issues when elections are won on imaginary issues &… https://t.co/W8XYTqpZji— KTR (@KTRBRS) June 16, 2024ఊహాజనిత సమస్యలు & ఉత్పాదక అవగాహనలతో ఎన్నికలు గెలిచినప్పుడు ఈ వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందన్నారు. వారు చెప్పినట్లు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నీళ్ల కోసం "క్యూ సెరా, సెరా"నే అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్ఖండ్లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్లో ఎనిమిది మంది, చిత్రకూట్లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్పూర్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు.
గిల్పై క్రమశిక్షణ చర్యలు.. క్లారిటీ ఇచ్చిన భారత బ్యాటింగ్ కోచ్
టీ20 వరల్డ్కప్-2024లో లీగ్ స్టేజిని టీమిండియా ఘనంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కెనడా-భారత్ మధ్య జరగాల్సిన గ్రూపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో గ్రూపు-ఎ నుంచి టీమిండియా 7 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే కెనడాతో మ్యాచ్ కంటే ముందే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయభేరి మ్రోగించింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్తో తలపడనుంది. ఈ వరల్డ్కప్ సంబంధించిన మొత్తం నాకౌట్ మ్యాచ్లన్నీ కరేబియన్ దీవుల వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలో విండీస్ దీవులకు వెళ్లేముందు టీ20 వరల్డ్కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్గా వెళ్లిన శుభ్మన్ గిల్, అవేశ్ఖాన్లను తిరిగి స్వదేశానికి పంపాలని భారత జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకుంది. అయితే టోర్నీ పూర్తికాకముందే టీమిండియా మెనెజ్మెంట్ ఎందుకు వారిద్దరి వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుందో ఆర్ధం కాక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యంగా శుబ్మన్ గిల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గిల్ సోషల్ మీడియాలో ఆన్ ఫాలో కూడా చేశాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. గిల్ గురుంచి వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తమని విక్రమ్ రాథోడ్ కొట్టిపారేశాడు. ముందస్తు ప్లాన్లో భాగంగానే గిల్, అవేష్ను స్వదేశానికి పంపినట్లు రాథోడ్ తెలిపాడు."ఇది మా ముందుస్తు ప్రణాళికే. అమెరికాలో గ్రూపు స్టేజి మ్యాచ్లు ఆడే సమయంలో నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలనుకొన్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయంలో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఆ తర్వాత కరేబియన్ లెగ్కు వెళ్లేముందు ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే గిల్, అవేష్ను రిలీజ్ చేశాము"అని ప్రెస్కాన్ఫరెన్స్లో రాథోడ్ పేర్కొన్నాడు.
రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్గా..!
ఇటీవల యువతలో లక్షల జీతాలు కోసం వెంపర్లాడేవారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనుకున్న కొలువులో ఉద్యోగం కొట్టి గ్రేట్ అనిపించుకునేవారు. కానీ ఇప్పడు ఆ ఉద్యోగాలే వారికి విసుగు తెప్పించి బయటకొచ్చేలా చేస్తున్నాయి. పైగా సాదాసీదా ఉద్యోగాలు చేస్తూ..అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కొందరు. అలాంటి కోవకు చెందిందే యూఎస్కు చెందిన మహిళ. మంచి ఉద్యోగం, లక్షల్లో వేతనం వదులుకుని ఎలాంటి ఉద్యోగం చేస్తుందో తెలిస్తే షాకవ్వుతారు.వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ వాలెరీ వాల్కోర్ట్ గూగుల్, అమెజనా వంటి పలు కార్పోరేట్ కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత సీటెల్లో అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ పార్టనర్గా ఏకంగా రూ. 83 లక్షల వేతనం అందుకున్నారు. 2020 వరకు పలు కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. ఇక వాటిల్లో ఉండే ఒత్తిడిలు, టెన్షన్లకు తట్టుకోలేక ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుని డిసైడ్ అయ్యింది వాల్కోర్ట్. అలా ఆమె ఫ్రాన్స్కు వెళ్లి పేస్ట్రీ స్కూల్లో జాయిన్ అయ్యి మూడెళ్ల పాట్ర శిక్షణ తీసుకుంది. అక్కడ రెస్టారెంట్ ఇంటర్నెషిప్లలో ఆహ్లదకరంగా ట్రైనింగ్ పూర్తి అయ్యిందని, ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకున్నానని చెబుతోంది వాల్కోర్ట్. ప్రస్తుతం ఆమె మైసన్ చబ్రాన్ రెస్టారెంట్లో పేస్ట్రీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. యూఎస్లోని కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్నప్పుడూ కంటే ఇప్పుడే మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. అంతేగాదు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విలువైన జీతం కంటే మనసుకు సంతోషాన్ని, హాయిని ఇచ్చే ఉద్యోగమే బెటర్ అంటోంది వాల్కోర్ట్. ప్రస్తుతం చాలామంది యువతలో ఈ ధోరణి ఎక్కువ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(చదవండి: హాట్టాపిక్గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!)
జీ-7 మద్దతు: ఉక్రెయిన్-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!
ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం జీ-7 సమ్మిట్లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్ను అమెరికా ఉక్రెయిన్కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్కు రష్యా ఆఫర్.. ఏంటంటే?
రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్పాట్ మీకు రోల్మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్బుక్ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
Darshan: రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్, పవిత్రగౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, వినయ్, నాగరాజ్, లక్ష్మణ, దిలీప్, ప్రదోశ్ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.ప్రత్యేక న్యాయవాది నియామకంరేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రసన్న కుమార్ను సర్కారు నియమించింది.క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నాదొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్ ఏం చెప్పారంటే... సార్.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్ వద్దకు దర్శన్, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..దొడ్డబళ్లాపురం: డి.బాస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు.
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి
ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్లో ఉత్తమ విదేశీ (స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్-571 ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. వారికి తినడానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మనిషి బ్రతకడానికి అవకాశమే లేని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్కరించారు. వారిలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఈ కథలో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి మరణించిన తమ స్నేహితుల శవాలను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్ థ్రిల్లర్గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్ఫ్లిక్స్ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
తప్పక చదవండి
- సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
- T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
- పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
- చెక్పోస్టు ఉద్యోగం భలే కిక్కు!
- ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
- టీడీపీ అరాచకం!
- వివాహేతర సంబంధం: భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
- నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
- ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
- బ్యాటరీ మింగేసిన చిన్నారి
సినిమా
Fathers Day: నాన్నే మొదటి హీరో.. స్పెషల్ ఫోటోలను పంచుకున్న స్టార్స్
నేడు(జూన్ 16) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు తమ నాన్నతో ఉన్న అనబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డకి నాన్నే మొదటి హీరో అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్తో సహా పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమ నాన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కేయండి. Father is the First Hero, to Every Child! Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge— Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q— Allu Arjun (@alluarjun) June 16, 2024Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH— shruti haasan (@shrutihaasan) June 16, 2024#ShrutiHaasan and #Ulaganayagan cute moments♥️♥️♥️♥️😍😍😍#Happyfathersday@ikamalhaasan@shrutihaasan#KamalHaasan#Indian2 pic.twitter.com/PyOfRsU6wF— Nammavar (@nammavar11) June 16, 2024 View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) https://www.instagram.com/p/C8RAhxbP7Ex/?img_index=1 View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu)
ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా
ఒకప్పడు తెలుగులో టాప్ హీరోయిన్గా మెప్పించిన ఇలియానా బాలీవుడ్లో కూడా మెప్పించింది. హ్యాపీ ఎండింగ్, రైడ్ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది. అయితే, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో 'దో ఔర్ దో ప్యార్'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాలో నోరా పాత్రలో చాలా బోల్డ్గా ఇలియానా మెప్పించింది. షిర్షా గుహా ఠాకూర్తా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 'దో ఔర్ దో ప్యార్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి
ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్లో ఉత్తమ విదేశీ (స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్-571 ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. వారికి తినడానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మనిషి బ్రతకడానికి అవకాశమే లేని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్కరించారు. వారిలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఈ కథలో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి మరణించిన తమ స్నేహితుల శవాలను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్ థ్రిల్లర్గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్ఫ్లిక్స్ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్)వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోవడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు నయా పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల పేర్లు చెప్పకుండా..ఏకంగా పోలీసుల పేర్లతో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్ నటి ఉషా రాణి సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే.. తెలివిగా వ్యవహరించి ఆన్లైన్ మోసానికి చెక్ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. వీడియోలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.’నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్కి లింక్ అయి ఉండడంతో నా షాపింగ్కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని ఉషారాణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Usha Rani (@usharani_actor)
ఫొటోలు
క్రీడలు
గిల్పై క్రమశిక్షణ చర్యలు.. క్లారిటీ ఇచ్చిన భారత బ్యాటింగ్ కోచ్
టీ20 వరల్డ్కప్-2024లో లీగ్ స్టేజిని టీమిండియా ఘనంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కెనడా-భారత్ మధ్య జరగాల్సిన గ్రూపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో గ్రూపు-ఎ నుంచి టీమిండియా 7 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే కెనడాతో మ్యాచ్ కంటే ముందే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయభేరి మ్రోగించింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్తో తలపడనుంది. ఈ వరల్డ్కప్ సంబంధించిన మొత్తం నాకౌట్ మ్యాచ్లన్నీ కరేబియన్ దీవుల వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలో విండీస్ దీవులకు వెళ్లేముందు టీ20 వరల్డ్కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్గా వెళ్లిన శుభ్మన్ గిల్, అవేశ్ఖాన్లను తిరిగి స్వదేశానికి పంపాలని భారత జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకుంది. అయితే టోర్నీ పూర్తికాకముందే టీమిండియా మెనెజ్మెంట్ ఎందుకు వారిద్దరి వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుందో ఆర్ధం కాక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యంగా శుబ్మన్ గిల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గిల్ సోషల్ మీడియాలో ఆన్ ఫాలో కూడా చేశాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. గిల్ గురుంచి వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తమని విక్రమ్ రాథోడ్ కొట్టిపారేశాడు. ముందస్తు ప్లాన్లో భాగంగానే గిల్, అవేష్ను స్వదేశానికి పంపినట్లు రాథోడ్ తెలిపాడు."ఇది మా ముందుస్తు ప్రణాళికే. అమెరికాలో గ్రూపు స్టేజి మ్యాచ్లు ఆడే సమయంలో నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలనుకొన్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయంలో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఆ తర్వాత కరేబియన్ లెగ్కు వెళ్లేముందు ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే గిల్, అవేష్ను రిలీజ్ చేశాము"అని ప్రెస్కాన్ఫరెన్స్లో రాథోడ్ పేర్కొన్నాడు.
T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టీ20 వరల్డ్కప్ టోర్నీల చరిత్రలో స్కాట్లాండ్ ఇదే అత్యధిక స్కోర్. 2022 ఎడిషన్లో ఐర్లాండ్పై చేసిన 176 పరుగులు ఈ మ్యాచ్ ముందు వరకు ఆ జట్టు అత్యధిక స్కోర్గా ఉండింది. నేటి మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడినా రికార్డు నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. సూపర్-8కు చేరే క్రమంలో స్కాట్లాండ్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకమై ఉండింది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే స్కాట్లాండ్ సూపర్-8కు చేరి ఉండేది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడటం.. నమీబియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇదివరకే ఆస్ట్రేలియా సూపర్-8కు క్వాలిఫై అయ్యింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్కు ఫుల్టైమ్ హెడ్ కోచ్గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్టైమ్ హెడ్ కోచ్గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్కు మెంటార్గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంతోనే గంభీర్కు టీమిండియా హెడ్ కోచ్గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
T20 World Cup 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్
నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్కప్ 2024లో ఇంగ్లండ్ చేతిలో తన జట్టు ఓటమి అనంతరం వీస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 39 ఏళ్ల వీస్.. 2013లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 2016 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. అనంతరం వీస్ తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు (2021 ఆగస్ట్ నుంచి). 2016 టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన వీస్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీస్ నమీబియా తరఫున ఆడుతూ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియా సాధించిన మొట్టమొదటి విజయంలో (2021 టీ20 వరల్డ్కప్లో నెదర్లాండ్స్పై) వీస్ కీలకపాత్ర పోషించాడు.రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన వీస్ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 51 టీ20లు ఆడి 73 వికెట్లు పడొట్టాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన వీస్ తన అంతర్జాతీయ కెరీర్లో దాదాపు 1000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి.అంతర్జాతీయ కెరీర్తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ కెరీర్లో ఘనమైన రికార్డు కలిగిన వీస్.. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 162 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి దాదాపు 10000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో వీస్ ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో కలిపి 490 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన వీస్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ల్లో ఆడుతున్నాడు.
బిజినెస్
మొబైల్ ఆర్డర్ పెడితే.. ఏమొచ్చిందో తెలుసా? ఖంగుతిన్న కస్టమర్
ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. డెలివరీ తీసుకునే వరకు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ అవునా? కాదా? అని సందేహమే. ఎందుకంటే గతంలో కొందమంది పెట్టిన ఆర్డర్స్ కారకుండా రాళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.ఒక వ్యక్తి అమెజాన్లో వివో వై20ఏ మొబైల్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా వచ్చింది. వచ్చిన డెలివరీని అన్బాక్సింగ్ చేసి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే మొబైల్ ఫోన్కు బదులు అందులో మూడు సబ్బులు ఉన్నాయి. ఇది చూసి ఖంగుతిన్న కస్టమర్ అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి సహాయం పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యడు.తాను ఎదుర్కొన్న సమస్యను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోలను కూడా షేర్ చేశారు. అమెజాన్లో మొబైల్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయని, దీనిపైన అమెజాన్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్లో ఎంత పెద్ద మోసాలు జరుగుతున్నాయో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు.मेरी भांजी @Anuja7Jha ने @amazonIN से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। @AmazonHelp कोई मदद भी नहीं कर रहा है। सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB— Narendra Nath Mishra (@iamnarendranath) June 14, 2024
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్పూర్లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024
టీసీఎస్కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.
వీడియోలు
ఈవీఎంలు రద్దు చేయాలంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై చర్యలేవి ?
కేసీఆర్ లెటర్ పై జగదీష్ రెడ్డి రియాక్షన్
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
బైక్ రేసర్ల హల్ చల్
విభజన హామీలను వెంటనే అమలు చేయాలి
ఎక్కడా తగ్గని రెడ్ బుక్.. బీభత్స పాలన
జులై-7 నుంచి తెలంగాణ బోనాలు
భూములకు కొత్త విలువ
తిరుమలకు పోటెత్తిన భక్తులు
ఫ్యామిలీ
చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?
కనస్ట్రక్షన్కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్కు ఒక ఉదాహరణ. చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్లైట్లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్గా..రీజన్ వింటే షాకవ్వుతారు!)
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్తో క్వాలిటీ మెటీరియల్తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్తో తయారైన ఈ మేకర్ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది.
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్గా మారిన వాల్పేపర్ డిజైన్స్..!
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్గా మారిన వాల్పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..?
న్యూస్ పాడ్కాస్ట్
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
వైఎస్సార్సీపీ నేతల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్సింగ్నగర్లో వైఎస్సార్సీపీ కార్యకర్త జహీర్బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కుట్టుమెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనంవెల్దుర్తి: వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేతఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్ప్లానింగ్ అధికారుల హడావుడిపాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్నగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు. శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.రాజకీయ కక్షలే కారణం.. రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్తో కలిసి గజేందర్ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్ను మొదట వె నుక నుంచి బైక్తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
పహాడీషరీఫ్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హఫీజ్బాబానగర్కు చెందిన సయ్యద్ మునీర్ కుమారుడు సయ్యద్ సమీర్(19), సోహెల్, సోఫియన్ స్నేహితులు. వీరిలో ఒకరైన సోహెల్ ఇదే కాలనీలలో ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సమీర్.. అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం.. నాకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. ఇలా చేయడం తప్పు అని సోహెల్కు సూచించాడు. ఇది జీరి్ణంచుకోలేని అతను సమీర్ తనపై దు్రష్పచారం చేస్తున్నాడని భావించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి తన మరో స్నేహితుడు సోఫియన్తో కలిసి ముందస్తు పథకంలో భాగంగా.. సమీర్ను తీసుకుని బాలాపూర్ ఠాణా పరిధిలోని గుర్రం చెరువు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సోహెల్ దాడికి పాల్పడ్డాడు. సమీర్ ఛాతి, వీపు భాగాల్లో ఐదుసార్లు బలంగా పొడిచాడు. ఈ సమయంలో విరిగిపోయిన కత్తి మృతుడి కడుపులోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.