Top Stories
ప్రధాన వార్తలు
పరాకాష్టకు 'విధ్వంసకాండ'
టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు కొనసాగిస్తున్నారు. దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికే అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల తీరు విస్తుగొలుపుతోంది. పట్టపగలు కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం వేస్తున్నారు. ఊరూరా విగ్రహాలను, శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరూ ఉండకూడదన్నట్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పార్టీకి ఓట్లేసిన వారిని దుర్భాషలాడుతున్నారు. ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇది అన్యాయం కదా.. అని ప్రశి్నస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పూ చేయకపోయినా, వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. యూనివర్సిటీ వీసీలపై దౌర్జన్యం చేస్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టిస్తుంటే.. ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తుంటే.. స్పందించాల్సిన పోలీసులు ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నిజంగా ఈ పరిణామం ఖాకీ డ్రస్సుకే అవమానం. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని రీతిలో గత ఐదేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వెలిశాయి. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, కొత్త రూపు రంగరించుకున్న స్కూళ్లు.. ఇలా ఎన్నెన్నో ప్రభుత్వ బిల్డింగ్లు నిర్మాణమయ్యాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి సమకూరింది. ఇదంతా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భద్రంగా కాపాడుకోవాలి. అలాంటిది పని గట్టుకుని ఊరూరా టీడీపీ సేన గునపాలు చేత పట్టుకుని ధ్వంసం చేస్తుండటాన్ని ఏమనాలి? రౌడీయిజం, దౌర్జన్యం, ఉన్మాదం.. ఇలా ఈ పదాలన్నీ తక్కువే. ఎవర్ని చూసుకుని ఇలా పేట్రేగిపోతున్నారు? చంద్రబాబు, లోకేశ్లను చూసుకునే కదా! బాపట్ల జిల్లాలో పిండ ప్రదానం చేస్తుంటే అడ్డుకోవడం.. మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభిమాని ఇంటిని జేసీబీతో కూల్చేయడం.. ఏకంగా నెల్లూరు మేయర్ దంపతులనే బెదిరించడం.. ఇదే జిల్లా దత్తులూరు మండలంలో జగనన్న లే అవుట్లోని ఇళ్లను ధ్వంసం చేయడం.. కొండాపురం మండలం గానుగపెంటలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటి ప్రహరీ, మెట్లు కూల్చేయడం.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం.. ఇకపై పోస్టులు ఆపేస్తామని వారితో ప్రకటనలు ఇప్పించడం.. తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ఒక్కో ఊళ్లో ఒక్కో అరాచకం కళ్లెదుటే కనిపిస్తోంది ఒక్క పోలీసులకు తప్ప అందరికీ. రేషన్ పంపిణీ వాహనంపై దాడివైఎస్ జగన్ ఫొటో చింపేసి.. టైర్లు కోసేసిన వైనం.. శ్రీకాకుళం జిల్లాలో ఘటనకాశీబుగ్గ: ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటి నుంచి అనేకరకాలుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తూ ప్రజలకు అందుతున్న సేవలను నిలిపివేయాలని కుట్రలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురం సచివాలయం పరిధిలో ఉన్న సున్నాదేవి గ్రామంలో రేషన్ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో ఆదివారం రాత్రి రేషన్ పంపిణీ చేసి చీకటి పడ్డాక వాహనాన్ని నిలిపి ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాహనం వద్దకు వచ్చి దానిపైన ఉన్న వైఎస్ జగన్ చిత్రపటాన్ని చించేశారు. వాహనం ఎడమ టైరును కోసేశారు. అక్కడితో ఆగకుండా వాహనానికి చుట్టూరా గీతలు గీసి రాళ్లతో కొట్టారు. వాహనం ఆపరేటర్ కిరణ్కుమార్ యాదవ్ వాహనం వద్దకు వెళ్లి చూసేసరికి టైర్లు కోసి బండి పాడైపోయి కనిపించింది. దీంతో అక్కడ రేషన్ పంపిణీ ఆగిపోయింది. ఉద్దానం ప్రాంతంలో ఉన్న మరో మూడు గ్రామాలకు సోమవారం బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.
మోదీ 3.0 : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయిఅమిత్ షా : కేంద్ర హోం శాఖనిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖజయశంకర్ - విదేశాంగ శాఖరాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖమనోహర్ లాల్ కట్టర్ : పట్టణ అభివృద్ధి శాఖశివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖసీఆర్ పాటిల్ : జలశక్తిపీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖగజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిజితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రిఅన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిభూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖకిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిచిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రికుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రిజ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీరవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రిహర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిసురేష్ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రితెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేకిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రిబండి సంజయ్ : హోంశాఖ సహాయ మంత్రిరామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిశ్రీనివాస్ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులు వీరే.. ఇక్కడ క్లిక్ చేయండిమరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
సరికొత్త సంకీర్ణ విన్యాసం
ఆహూతులైన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, అనేక రంగాల ప్రముఖులు, వేలాది జనం సాక్షిగా, రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. భారత ప్రధాని స్వర్గీయ నెహ్రూ తర్వాత మళ్ళీ వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మరో వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రధాన మంత్రి కిసాన్ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకంతో సోమవారం ఉదయమే మోదీ పనిలోకి దిగిపోయారు. మొదటి రెండు పర్యాయాలు బీజేపీ సొంత బలంతో ‘మోదీ సర్కార్’గానే పాలన చేసిన కమలనాథులు ఈ మూడోసారి మాత్రం చాలినంత సంఖ్యాబలం లేక, మిత్రపక్షాల అండతో అచ్చమైన ‘ఎన్డీఏ సర్కార్’గా పని చేయాల్సి రావడం కొత్త పాలనలోని పెద్ద మార్పు. గతంలో గుజరాత్ సీఎంగా కానీ, ఆ తరువాత గడచిన పదేళ్ళుగా ప్రధానిగా కానీ తన మాటే శాసనంగా చలామణీ అయిన మోదీ ఇప్పుడు వివిధ ప్రాంతాలు, పార్టీలు, ఆశలు, ఆకాంక్షలకు చెవి ఒగ్గి, ఏకాభిప్రాయసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జనరల్ (24), ఓబీసీ (27), ఎస్సీ (10), ఎస్టీ (5), మైనారిటీలు (5)... ఇలా వివిధ వర్ణ శోభితమైన హరివిల్లుగా మొత్తం 71 మంది సహచరులతో మోదీ సారథ్యంలో కొత్త మంత్రి మండలి ఏర్పాటైంది. మొత్తం 81 మంది మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఏకంగా 71 మందిని తొలి విడతలోనే తీసుకున్న మోదీ 24 రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. అయితే, ప్రమాణ స్వీకారం జరిగిన అనేక గంటల తర్వాత సోమవారం రాత్రికి గాని మంత్రిత్వ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడలేదు. ఏకపక్ష నిర్ణయాలు అలవాటైన ప్రభుత్వ పెద్దలు సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పక్షాలకూ సంతృప్తి కలిగేలా వ్యవహరించడంలోని ఇబ్బందిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది. ఆ మాటకొస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తరువాత కూడా సంకీర్ణ పక్షాలలో కొన్ని బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక మంత్రి పదవి... అదీ సహాయ మంత్రి పదవే ఇవ్వడం, అందులోనూ గతంలో క్యాబినెట్ హోదాలో పనిచేసిన ప్రఫుల్ పటేల్కు ఆ స్థాయి తక్కువ పదవి ఇవ్వడం పట్ల అజిత్ పవార్ సారథ్యంలోని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఆదివారమే అభ్యంతరం చెప్పింది. మంత్రి పదవిని తిరస్కరించింది. గెలిచిన అనురాగ్ ఠాకూర్ నుంచి, ఓడిపోయిన స్మృతీ ఇరానీ దాకా పలు పాత ముఖాలకు కొత్త సర్కారులో మోదీ మొండిచేయి చూపారు. అదే సమయంలో 33 మందిని మొదటిసారి మంత్రుల్ని చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికీ మంత్రులుగా బెర్తులిచ్చారు. ఆ లెక్కలెలా ఉన్నా, సోమవారం సాయంత్రం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగే లోగా... సంకీర్ణ సర్కారు నుంచి మరిన్ని గొంతులు పైకి లేచాయి. ఏడుగురు ఎంపీలున్న తమ కన్నా తక్కువ సంఖ్యాబలం గల పార్టీలకు క్యాబినెట్ హోదా మంత్రి పదవిచ్చి, తమకు మాత్రం స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చారంటూ ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వ్యక్తం చేసింది. సొంత గూటిలోనూ బీజేపీకి సణుగుళ్ళు తప్పట్లేదు. కేరళలో తొలిసారిగా ఖాతా తెరిచిన కమలం పార్టీ త్రిస్సూర్ నుంచి గెలిచిన సినీ నటుడు సురేశ్ గోపికి మంత్రిమండలిలో స్థానం కల్పించింది. అయితే, సహాయ మంత్రి హోదా ఇచ్చినందుకు కినిసి ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు రావడం, రచ్చ రేగేసరికి ఆఖరుకు ట్విట్టర్లో అలాంటిదేమీ లేదని ఖండించడం చకచకా జరిగాయి. వీటిని బట్టి సంకీర్ణ సర్కార్ నడపడంలోని సవాళ్ళు మోదీకి ఆదిలోనే అర్థమై ఉండాలి. మరోపక్క మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ క్యాబినెట్లో ప్రాతినిధ్యమూ కమలనాథుల ‘మిషన్ సౌత్’ వ్యూహంలో భాగమే. ఇక, వివిధ రాష్ట్రాలకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆరుగురు ఇప్పుడు మోదీ క్యాబినెట్లో ఉన్నారు. స్వయంగా మోదీని సైతం కలుపుకొంటే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అంటే పాలనలో అనుభవానికి కొరత లేదు. కాకపోతే, వ్యక్తిగతంగా అధికారంలో శిఖరాలను చూసినవారు కలసికట్టుగా ముందడుగు వేయడంలో అహంభావాలకు తావు లేకుండా చూసుకోగలరా అని విశ్లేషకుల అనుమానం. అయితే, రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను గత ప్రభుత్వంలోని మంత్రులకే కట్టబెట్టారు. ఇది కొత్త సీసాలో పాత సారాగా తోచినా, విధానాల కొనసాగింపు, సుస్థిరత్వానికి పెద్దపీట వేశారనుకోవాలి. వెరసి మోదీ ప్రజల కొత్త తీర్పుతో ఇప్పుడు కొత్త పిచ్ మీద ఆట మొదలుపెట్టారు. ఒకప్పటి వాజ్పేయి సంకీర్ణ సర్కార్లా సక్సెస్ కావాలంటే సహనం, సహానుభూతి పెంచుకోక తప్పదు. సంకీర్ణ సర్కారుకు తోడు బలమైన ప్రతిపక్షమూ ఉన్నందున పించ్ హిట్టింగ్కు అవకాశం లేదు. తిరుగులేని మెజారిటీ ఉన్న గతంలోలా ఇప్పుడు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్త లాక్డౌన్ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయలేరు. వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి లాంటి సొంత అజెండాను కాషాయధ్వజులు కొన్నాళ్ళు పక్కనపెట్టక తప్పదు. ఆటలో దూకుడుకు అవకాశం లేనప్పుడు అవుటవకుండా ఆత్మరక్షణ ధోరణిలో ఆడక తప్పదు. పదేళ్ళుగా ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయాలతో ఆడిస్తున్న పెద్దలకు కచ్చితంగా ఈ సంకీర్ణపు ఆట సరికొత్తదే! అలాగే పెరిగిన బలంతో ఊపిరి పీల్చుకున్న ప్రతిపక్షం సైతం 18వ లోక్సభలో కూటమిగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రజలకు మేలు.
‘‘రాష్ట్రపతి భవన్లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్లోకి చిరుత పులి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్ సీఎం కీలక కామెంట్స్
చండీగఢ్: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్మాన్ మీడియాతో చెప్పారు. జూన్6వ తేదీన కంగన చండీగఢ్ ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది.
వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణితో పాటు వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపీదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే డా. సుధ తదితరులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు.
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
వెయిటింగ్ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, బుజ్జి టీజర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్.. బుజ్జిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్ రెబల్ ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్లో బ్యాగ్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్ ఇండియా మెయిన్ సిటీస్లోని థియేటర్స్లో కల్కి ట్రైలర్ను ప్రదర్శించారు.
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది.
ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్లోని ధార్కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్లో దీదీ ఠాకూర్గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్లో చోటు దక్కగా, మిగిలిన వారు రాష్ట్ర మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!)
తప్పక చదవండి
- పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
- నేడు రాయలసీమలో భారీ వర్షాలు!
- జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
- Canadian Grand Prix 2024: వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’
- సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
- గ్రూప్–1 ప్రిలిమ్స్కు తీవ్ర పోటీ
- త్వరలోనే విద్యా కమిషన్
- మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త
- ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
- పాకిస్తాన్ ఇక ఇంటికేనా.. సూపర్-8 చేరాలంటే ఇలా జరగాలి?
సినిమా
దళపతి విజయ్ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం!
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. గతేడాది లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు విద్యార్థులను ఆయన త్వరలోనే సన్మానించనున్నారు. ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాపర్గా నిలిచిన వారికి సర్టిఫికెట్తో పాటు రివార్డులను విజయ్ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో టాపర్గా నిలిచిన విద్యార్థులను సన్మానించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT)లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5, 2024న థియేటర్లలోకి రానుంది.
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్లో నటీనటులు సైలెంట్గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అలా దాదాపు 22 ఏళ్ల క్రితం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఓ పాప ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు యామిని శ్వేత. డైరెక్టర్ తేజ తీసిన హిట్ సినిమా 'జయం'లో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించిన పాప గుర్తుందా? ఆమెనే ఈమె. సీరియల్ నటి జయలక్ష్మి కూతురు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల రావడానిక ముందు 10 సీరియల్స్లో చేసింది. అలా నటిస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజకు ఫొటోలు పంపారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికైంది.'జయం'త పాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. చదువు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిలైంది. తాజాగా ఈమెని చూసిన కొందరు.. 'జయం' నటి ఏంటి ఇంతలా మారిపోయిందని మట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)
వెయిటింగ్ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, బుజ్జి టీజర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్.. బుజ్జిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్ రెబల్ ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్లో బ్యాగ్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్ ఇండియా మెయిన్ సిటీస్లోని థియేటర్స్లో కల్కి ట్రైలర్ను ప్రదర్శించారు.
ఫొటోలు
మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)
Mahishivan: సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్ (ఫోటోలు)
బర్త్డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)
Suma Kanakala: అనార్కలీ డ్రెస్లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్న సుమ (ఫోటోలు)
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
క్రీడలు
సినెర్... కొత్త నంబర్వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్డామ్ ఓపెన్లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది.
2026 FIFA World Cup: భారత ఫుట్బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్గా ఖతర్తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్కు చేరుకుంటుంది. భారత్తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది.
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
'పాక్ విజయం సాధించాల్సింది.. కానీ భారత్ మాత్రం అద్బుతం'
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో విజయాన్ని తమ భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా దాయాది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన రోహిత్ సేన.. బౌలింగ్లో మాత్రం విజృభించింది. 120 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసిన భారత బౌలర్లు తమ జట్టుకు అద్భుమైన విజయాన్ని అందించారు. ఈ క్రమంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా అన్ని విభాగాల్లో బ్యాలెన్స్గా ఉందని వకార్ యూనిస్ కొనియాడాడు."ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్లో విఫలమకావడంతో పాకిస్తాన్ ఈజీగా విజయం సాధిస్తుందని నేను భావించాను. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చూసి పాక్ ముందు 140 నుంచి 150 పరుగుల స్కోర్ ఉంచుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఆఖరిలో వరుసగా వికెట్లు కోల్పోవడం అనుకున్న టార్గెట్కు చేరుకోలేకపోయింది. అయితే భారత జట్టు మాత్రం అన్ని విభాగాల్లో బ్యాలెన్స్గా ఉంది. ఒకవేళ బ్యాటర్లు విఫలమైతే బౌలర్లు యాక్షన్లోకి వస్తారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. వారి ఫీల్డింగ్ కూడా అత్యుత్తమంగా ఉంటుంది. అందుకే భారత్ సూపర్ టీమ్గా కన్పిస్తోంది. పాక్కు ఆరంభం వచ్చినప్పటికి సద్వినియోగం చేసుకోలేకపోయారు. మిడిలార్డర్ బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయారని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వకార్ పేర్కొన్నాడు.
బిజినెస్
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 23,234 వద్దకు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు దిగజారి 76,490 వద్ద ముగిసింది. గతవారంలోని వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది. మదుపర్లు గరిష్ఠాల వద్ద షేర్లు విక్రయించినట్లు తెలుస్తుంది.సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, హెచ్యూఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇటీవల పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్విజయ్శేఖర్ శర్మ మే 22న షేర్హోల్డర్లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!.. ఎందుకంటే?
రెండు రోజులకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు ఉలుకు పలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఏకంగా రూ. 2080 తగ్గి పసిడి ప్రియులకు ఊరట కలిగించిన గోల్డ్ రేటు అదే ధర వద్ద నిలిచింది. ఈ రోజు (జూన్ 10) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో సోమవారం ఒక తులం బంగారం ధరలు రూ. 65700 (22 క్యారెట్స్), రూ.71760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71820గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని తెలుస్తోంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, చెన్నైలో మాత్రం ఈ రోజు కూడా బంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72330 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ ధర నిన్నట్లి కంటే రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కలిగించినప్పటికీ.. వెండి మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. ఈ రోజు (జూన్ 10) ఒక కేజీ వెండి ధర రూ. 91700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు రూ. 200 పెరిగినట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్
భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్ఇంజిన్ కంపెనీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్ పిచాయ్(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్పిచాయ్గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్గా పనిచేసేవారు. సుందర్ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్మెటీరియల్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ టూల్బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర అప్లికేషన్ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్తో గౌరవించింది. 2019 డిసెంబర్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!టెన్షన్ పడిన సీఈఓ..సుందర్ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్పుర్లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్ దంపతులకు కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్ ఇద్దరు పిల్లలు.
వీడియోలు
బాధితులకు పరామర్శ.. దాడులు ఆపకపోతే..
జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?
ముఖ్యమైన శాఖలు ఎవరెవరికి..?
కీలక చర్చలు .. వైఎస్ జగన్ ను కలిసిన YSRCP నేతలు
EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....
టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు
కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే
అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం
నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు
ఫ్యామిలీ
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి
ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్లోని ధార్కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్లో దీదీ ఠాకూర్గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్లో చోటు దక్కగా, మిగిలిన వారు రాష్ట్ర మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!)
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా.. లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్ పోటీ!
ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో పనిచేసే కారును రూపొందించింది.హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
పారిభాషిక పదాలు.. సృష్టించుకోవాలి!
ఖగోళ శాస్త్రం వంటివాటిల్లో పరిశోధనలు చేస్తూనే బ్రహ్మ గుప్తుడు లాంటి భారతీయ గణిత మేధావులు ప్రపంచానికి సున్నా (0) ను అందించారు. సున్నా (0) విలువ కూడా భారతీయ గణిత వేదవేదాంగ సాహిత్యవేత్తే కనిపెట్టాడు. అయితే అది ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి కారణం గణితం, భౌతిక, రసాయనిక జీవ శాస్త్రాదులను బాగా కప్పివేసిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధ భావజాలం. ఆ ముసుగును తీసి భారతీయ గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాదుల తేజాన్ని ప్రయోగశాలలో చూపించాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళేవారికి ఇక్కడ సరైన ఆదరణ లభించడం లేదు.సమస్త విజ్ఞానం మన వేదాలలోనే ఉందని మన ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా... ప్రయోగ శాలలో నిలవని విజ్ఞానం తుదకు అజ్ఞానంగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో నిలవాలని తపించే భారతీయ వేదవేదాంగ శాస్త్రాలలో నిపుణులైనవారికి ఆర్థిక శక్తి లేమి అడ్డు వస్తోంది. కాస్త సైన్స్ చదువుకున్నవారు ఆధ్యాత్మిక జ్యోతిష్యాదులను అడ్డు పెట్టుకొని మాట్లాడే మాయగాళ్ళను సూడో సైన్స్గాళ్ళు అంటే, వీరు వారిని మరో విధంగా వెక్కిరిస్తారు. ఈ చర్చోపచర్చలు కాలక్షేపానికి తప్ప మరెందుకూ పనికిరావు. భారతీయ వేదవేదాంగ పురాణేతిహాసాలలో ఏ శాస్త్రం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ యా విషయాల గురించి మాట్లాడటానికి తగినంత పారిభాషిక (టెర్మినాలజీ) పదజాలం లేదన్నది అక్షర సత్యం.వేదవేదాంగ పురాణేతిహాసాల విజ్ఞానం కథా రూపంలో ఉంటుంది. కథా భాష, ప్రయోగ శాల భాష ఒక రీతిన ఉండదు. ఉదాహరణకు రాజకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆకాశంలోని పక్షుల వరుసలను చూసింది. మొదటి వరుసలో ఒకటి, రెండవ వరుసలో రెండు ఇలా... పదవ వరుసలో పది! మొత్తం పక్షులు ఎన్ని అంటే అందరి పప్పులు ఉడికాక రాజకుమారి 55 అని సమాధానం చెబుతుంది.n(n+1/2) అనే ఆధునిక గణిత సూత్రం రాజకుమారికి తెలియకపోవచ్చును. అయితే వేగంగా 10+(9+1=10)+(8+2=10)+(7+3=10)+(6+4=10) +5=55 అని నోటితో గణించే మేధ రాజకుమారికి ఉండి ఉండవచ్చు. పదికి దగ్గరకు వచ్చి కూడికలు, తీసివేతలు వంటివి చేస్తే లెక్క సులభం అవుతుంది అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకుమారి మేధను సూత్ర బద్ధం చేస్తే, భారతీయ గణితం అందరికీ అర్థమవుతుంది. అయితే సూత్ర బద్ధం చేయడానికి కావలిసినంత టెర్మినాలజీని మనవారు మనకు అందించలేదన్నది నిజం. టెర్మినాలజీ లేకుండా ఆధ్యాత్మికతతో, జ్యోతిష్యాది గణింపుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.మన వేదవేదాంగ పురాణేతిహాసాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కావల్సినంత టెర్మినాలజీని మనం పెంచుకోవాలంటే... మన పండితులు చాంధస భావాలకు అతీతంగా, అసూయాద్వేషాలకు అతీతంగా మెలగాలి. రేపటి తరానికన్నా మన శాస్త్రవిజ్ఞానాన్ని తెలిపే టెర్మినాలజీని పెంచే దిశగా పోయేటందుకు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్ళాలంటే కొందరు తెలుగు భాషాభిమానులకు కోపం వస్తుంది. మన సంప్రదాయం, మన పద్యం, మన ఛందస్సు అంటూ ఆవేశ పడిపోతారు.నిజమే... కొన్ని వందల ఏళ్ళ నుండి మన ఛందస్సులో కొందరు మహా కవులు, కవులు పద్యాలు రాస్తున్నారు. సంతోషమే. కానీ అదే ఛందస్సులో కంప్యూటర్కు చెందిన ద్విసంఖ్యా మానాది గణితాంశాలు ఉన్నాయని ఎందరికి తెలుసు? పోనీ కొందరికి తెలుసు అనుకుందాం. తెలిసినవారు ఆ యా అంశాలను ప్రయోగశాల వద్ద ఎంత మేర సక్సెస్ చేశారు? వారికి తెలిసినదానిని ఎంత మంది గణిత సూత్రాలుగా మలచారు?రేపటి తరమన్నా ఇంగ్లిష్ మీడియం వైపు నకు వెళ్ళి మన వేదాంగాదులలో ఉన్న విజ్ఞాన ఛాయలకు చక్కని టెర్మినాలజీ తయారుచేస్తే, మనం పశ్చిమ దేశాల కంటే ముందే ఉంటాము. మాతృభాష లోనే ఈ పని చెయ్యవచ్చు కదా అని కొందరు అనవచ్చు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన మాతృభాషా పదజాలం కొంచెం ముందుకు వెళితే అది ఆధ్యాత్మికతలో కూరుకుపోతుంది. లేదా ఖగోళం, జ్యోతిషం అంటూ కాలక్షేపం చేస్తుంది.ఇంగ్లిష్ మీడియం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ వేశారు. దానిని అలాగే కొనసాగించాలి. ఛందస్సు కేవలం పద్యాలు రాసుకోవడానికి పుట్టింది కాదనీ, అందులో ద్విసంఖ్యా మాన గణితం, ఇంకా ఆధునిక గణితంలోకి ప్రవేశించని ఉదాత్తానుదాత్తాదుల గణితం ఉందనీ రేపటి తరమన్నా గమనించాలి.రెండు రెళ్ళు ఆరు అన్నది సాహిత్యంలో చెప్పుకోవడానికి ఆహ్లాదంగా ఉండవచ్చు. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది నిజం. ఆ నిజం మాటున ఉన్న సైన్స్, మాథ్స్ వైపు వెళ్ళాలంటే ఆయా భారతీయ సబ్జెక్టులకు సరిపడ టెర్మినాలజీ తప్పక ఉండాలి.అభిప్రాయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు, వ్యాసకర్త విశ్రాంత ఉపాధ్యాయులు, 9849448947
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త
చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
ఆంధ్రప్రదేశ్లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎంఎన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది. నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్డిఎఫ్సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది. విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
ధారూరు: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.