తిరుమల చేరుకున్న వైఎస్‌ జగన్‌..

 అనితరసాధ్యమైన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీనివాసుడి దర్శనం చేసుకునేందుకు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. ఒక సామాన్య భక్తుడిలా అలిపరి మార్గంలో కాలినడకన ముందుకుసాగిన జననేత వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top