ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

Published Mon, Sep 23 2019 8:06 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్‌ స్వయంగా స్వాగతం పలికి లోపలికి తోడ్కోని వెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగే అవకాశముంది. విభజన  చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement