వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ లక్ష్యం

 వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తన బ్యాటింగ్‌లో ఇరగదీసింది. ఆరంభం మొదలుకొని చివర వరకూ పవర్‌ హిట్టింగ్‌తో చెలరేగిపోయింది.ఫలితంగా వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి వన్డేలో 287 పరుగులు చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మరో వంద పరుగులు జోడించి 387 పరుగులు చేయడం విశేషం. రోహిత్‌ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)ల సెంచరీలకు జతగా, శ్రేయస్‌ అయ‍్యర్‌(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో  భారత్‌ భారీ స్కోరు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top