ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో దుర్మార్గపు పాలన సాగిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుడివాడలో జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. అందిన కాడికి దోచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఆయన పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మైండ్ పనిచేయడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.