బయటపడ్డ రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన! | Sakshi
Sakshi News home page

బయటపడ్డ రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన!

Published Thu, Feb 13 2020 8:20 PM

ఆదాయ పన్ను అధికారులు ఆరు రోజులుగా జరుపుతున్న సోదాల్లో భాగంగా భారీ కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణెలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు చేశారు. ఇందులో భాగంగా బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమార్కులు భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement