పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం | Sakshi
Sakshi News home page

పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం

Published Fri, Feb 7 2014 4:57 PM

తెలంగాణ బిల్లుకు తాము 10 సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలని, తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని తాము కోరామన్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిని యూటీ చేయాలని శీలం అన్నారు.