2014 సార్వత్రిక ఎన్నికలు... గతంలో దేశంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నమైనవని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం దేశ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. న్యూఢిల్లీలో మూడవ రోజు జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పాల్గొని ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వ పాలనపై మోడీ తనదైన శైలీలో నిప్పులు కక్కారు