2002లో తెలంగాణ విభజన నిర్ణయాన్ని అప్పటి హోం మంత్రి అద్వానీ తిరస్కరించారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరరావు తెలిపారు. రాజ్యసభలో సోమవారం తెలంగాణ అంశంపై మాట్లాడుతూ.. గతంలో బీజేపీ తెలంగాణ బిల్లును తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. 2002 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్లును అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వానీ తిరస్కరించారన్నారు. 2004లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీనే ప్రస్తావించిందన్నారు. 2004లోనే రెండో ఎస్సార్సీని ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలాల పర్యటించి శ్రీకృష్ట కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజనకు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సూచించారని కేవీపీ తెలిపారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలన్నారు.
Aug 12 2013 6:33 PM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement