అమెరికాకు చైనా వార్నింగ్ | China warns US not to meddle in border row with India | Sakshi
Sakshi News home page

Oct 27 2016 8:13 AM | Updated on Mar 20 2024 3:12 PM

బీజింగ్ల మధ్యనున్న సరిహద్దు సమస్యలో మధ్యలో తలదూర్చవద్దని అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనీస్ బోర్డర్కు పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటించిన అనంతరం, బీజింగ్ ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా చేస్తున్న ఈ కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను మరింత జటిలం చేయడమేనని, విద్రోహ శాంతిని రెచ్చగొట్టడేమనని విమర్శించింది. "ఏ ప్రాంతానైతే మీ సీనియర్ దౌత్య అధికారి సందర్శించారో, ఆ ప్రాంతం చైనా, భారత్లకు మధ్య వివాదాస్పదమైన రీజియన్గా ఉంది. చైనా, భారత్ వివాదాస్పదమైన ప్రాంతంలో అమెరికా రాయబారి సందర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మీడియా ముందు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement