ఏపీఎన్జీవో కార్యాలయంలో వాటా కోసం ఏపీ ఎన్జీవోలు.. తెలంగాణ ఎన్జీవోల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో తమకూ వాటా ఇవ్వాలంటూ తెలంగాణ ఎన్జీవోలు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. కార్యాలయంపై పూర్తి హక్కులు తమవేనంటూ ఏపీఎన్జీవోలు ఎదురు తిరిగారు. దాంతో ఇరువర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రెండు ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు పరస్పరం తలపడ్డారు. కుర్చీలు విసురుకున్నారు, కొట్టుకున్నారు కూడా. గతంలో కూడా ఈ కార్యాలయంలో హక్కులకు సంబంధించి కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి.
Jan 29 2015 5:41 PM | Updated on Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement