విద్యుత్ సమస్యలపై తక్షణం స్పందించాలి
బద్వేలు అర్బన్/అట్లూరు: విద్యుత్ సమస్యలపై తక్ష ణం స్పందించాలని అధికారులకు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ తెలిపారు. గురువారం బద్వేలు, అట్లూరు విద్యుత్ కార్యాయాల్లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యుత్ సంబంధిత సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయం, లో ఓల్టేజ్ వంటి సమస్యలపై ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని, ఫీడ ర్లు, ట్రాన్స్ఫార్మర్లను పర్యవేక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, నెట్ వర్క్ బలోపేతం ద్వారా లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుల్లాయప్ప, ఏఈలు షర్మిల, శివ, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
ఒంటిమిట్ట: గత రెండు రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ ఎస్.రమణ సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రజల భద్రత, సేవల పునరుద్ధరణ కోసం ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్,హెల్ప్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్.రమణ


