పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 220 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 220 మంది హాజరు

Jun 25 2025 7:20 AM | Updated on Jun 25 2025 7:20 AM

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు  220 మంది హాజరు

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 220 మంది హాజరు

కడప ఎడ్యుకేషన్‌: కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగుతున్న మంగళవారం నాల్గవ రోజు కౌన్సెలింగ్‌కు 220 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 50001వ ర్యాంకు నుంచి 68 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్‌ కేంద్రానికి చేరుకుని తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి, ఛీప్‌ వెరిఫికేషన్‌ ఆపీసర్‌ పద్మజ, వెరిఫికేషన్‌ ఆఫీసర్లు ప్రసాద్‌, ప్రశాంతి, ప్రసన్నలతోపాటు రాజేష్‌ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

నేటి కౌన్సెలింగ్‌కు...

నేడు నిర్వహించబోయే కౌన్సిలింగ్‌ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 68001 నుంచి 86 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు.

పర్యాటక వ్యయంపై జాతీయ సర్వే

కడప సెవెన్‌రోడ్స్‌: దేశీయ పర్యాటక వ్యయం, జాతీయ గృహస్థ ప్రయాణంపై జాతీయ గణాంక శాఖ 80వ విడత సర్వే చేపడుతోంది. ఈ సర్వే ఈ ఏడాది జులై నుంచి వచ్చే ఏడాది జూన్‌ వరకు కొనసాగనుంది. వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు ఆ శాఖ సహాయ సంచాకులు గంపా శ్రీనివాసరావు తెలిపారు. గృహస్తుల రోజువారి ప్రయాణాలు, వాటిపై ఖర్చు, రవాణా మార్గాలు, వసతులు, ఆహార వసతులు తదితర విషయాలను సర్వేలో తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించిన శిక్షణ తరగతులు కడపలో నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement