గంగమ్మకు బోనాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

గంగమ్మకు బోనాల సమర్పణ

Jun 23 2025 6:12 AM | Updated on Jun 23 2025 6:12 AM

గంగమ్మకు బోనాల సమర్పణ

గంగమ్మకు బోనాల సమర్పణ

లక్కిరెడ్డిపల్లి: కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా లక్కిరెడ్డి పల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఆదివారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా ..కరుణ చూపు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా దీవించమ్మా అంటూ రైతులు వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.

27 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ

అఖిల భారత మహాసభలు

మదనపల్లె సిటీ: కేరళలోని కొజికోడ్‌లో జూన్‌ 27 నుంచి 30 వరకు ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి అన్నారు. ఆదివారం మహాసభలకు సంబంధించిన పోస్టర్స్‌ను స్థానికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 50లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థిసంఘంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement