
కౌలు రైతులకు కార్డులందేనా
కడప అగ్రికల్చర్: అన్నదాతలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఖరీఫ్ మొదలై 20 రోజులు దాటినా కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర అలసత్వం చూపిస్తోంది. ఫలితంగా కార్డులందక.. రుణాలు దక్కక కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సీజన్కుగాను జిల్లాలో 11000 వేల కౌలు రైతులకు గుర్తింపుకార్డుల పంపిణీ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు కేవలం 102 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. నిజానికి జిల్లావ్యాప్తంగా అధికారంగా 40 వేల మందికిపైగా కౌలు రైతులు ఉన్నట్లు అంచనా కాగా అంతకంటే ఎక్కువగానే జిల్లాలో కౌలు రైతులు ఉన్నారు. కాగా కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించలేదు.
గ్రామ సభలు ఏవీ?
సాధారణంగా పంటల సీజన్ మొదలవ్వగానే కౌలు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామా ల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేస్తారు. కానీ అలాంటి ప్రక్రియ జరగడం లేదని కౌలు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు పంటలసాగుకు బయట వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కడపజిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 11,000 కౌలు కార్డులు మంజూరు లక్ష్యంగా ఉండగా ఇప్పటికి 102 కార్డులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది కౌలు కార్డుల లక్ష్యం.. 11,000
ఇప్పటి వరకు పంపిణీ చేసిన
కౌలు కార్డులు: 102
కౌలు రైతులకు అండగా జగన్ సర్కార్
ఖరీఫ్ మొదలై 20 రోజులు దాటినా అరకొర కార్డులే పంపిణీ
బ్యాంకు రుణాల కోసం కౌలు రైతుల ఎదురు చూపులు
సకాలంలో కౌలు కార్డులను మంజూరు చేయాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు దాటింది. ఇంత వరకు వందకుపైగా మాత్రమే కార్డు లు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం ముమ్మరం కావాలంటే వ్యవసాయ, రెవిన్యూశాఖలు గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతులకు కార్డుల పంపిణీ ముమ్మరం చేయాలి. కౌలు కార్డులను సకాలంలో ఇవ్వకపోతే రైతు భరోసా, పంట రుణాల పెట్టబడి, పంటలబీమా, సబ్సిడీ విత్తనాలు వంటి అందే పరిస్థితి ఉండదు. – బి. దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
కార్డుల పంపిణీ మొదలైంది
కౌలు రైతుల కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమైంది. ఈ విషయమై వీఆర్ఓలు, వ్యవసాయ అధికారులతో పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది 11 వేల కార్డుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా వందకుపైనే కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేశాం. మిగతా కార్డులను కూడా వీలైనంత త్వర గా పంపిణీ చేసేందుకు కృషి చేస్తాం.
– చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
కౌలు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించి ఒక సారి జారీ చేసిన కార్డును మళ్లీ యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారులు జారీ గణనీయంగా పెరిగింది. అసలు రైతులు మాదిరిగా కౌలు రైతులకు పంట రుణాలు అందించడంతోపాటు రైతు భరోసా, పంటల భీమా పరిహారం అందించి అండగా నిలిచింది.

కౌలు రైతులకు కార్డులందేనా

కౌలు రైతులకు కార్డులందేనా

కౌలు రైతులకు కార్డులందేనా

కౌలు రైతులకు కార్డులందేనా