
తిరుచ్చి వాహనంపై శ్రీనివాసుడు
బద్వేలు అర్బన్: బద్వేలు పట్టణంలోని ఫైర్ ఆఫీసు వెనుకభాగంలో ఉన్న శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారిని తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో లక్ష్మీహయగ్రీవ హోమము, వేదస్వస్తి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వల్లంకొండు వెంకటరమణ, సెక్రటరీ అంకయ్య, ఆలయ ప్రధాన అర్చకులు వీరేశాచార్యులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా బదిలీ ప్రక్రియ
కడప ఎడ్యుకేషన్: కడపలోని డీఈఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 1998,2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 901 ఖాళీలను ప్రదర్శించగా జిల్లాలో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమకు సంబంధించిన స్థానాలకు కోరుకుని బదిలీపై వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 206 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు గాను 201 మంది బదిలీ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. ఈ బదిలీ కౌన్సెలింగ్లో వైఎస్సార్ కడపజిల్లా డీఈఓ షేక్ షంషుద్దీన్, అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం, డీఈఓ కార్యాలయ ఏడీ సీవి రామకృష్ణ, డీఈఓ కార్యాలయ సిబ్బంది సుదర్శన్రెడ్డి, శ్యాసుందర్రెడ్డి, శివప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు.
● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు.
● ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
రెండో రోజు
155 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండవ రోజు ఆదివారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 15001వ ర్యాంకు నుంచి 32 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకుని తమ కు సంబంధించి దృవపత్రాలను పరిశీలించుకున్నారు. రెండవ రోజు కౌన్సెలింగ్కు 155 మంది అభ్యర్థులు హాజరై తమ ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆపీసర్ దామోధర్, వెరిఫికేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
నేటి కౌన్సెలింగ్కు...
జిల్లావ్యాప్తంగా 32000 నుంచి 50 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు సోమవారం కౌన్సెలింగ్ ఉంటుందని కో ఆర్డినేటర్ జ్యోతి తెలిపారు.

తిరుచ్చి వాహనంపై శ్రీనివాసుడు

తిరుచ్చి వాహనంపై శ్రీనివాసుడు