
ఉత్సాహంగా జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషులకు 100 మీ., 200 మీ., 400 మీ., 800 మీటర్లు పరుగు పోటీలు, లాంగ్జంప్, షార్ట్పుట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 70 మంది పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈనెల 14, 15 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహమర్ బాషా తెలిపారు. ఎం.లోకేశ్వరరావు, జి.సింహాచలం, పి.మంజునాథ, బి.యేసు వరప్రసాద్, కె.మహేష్, బి.మల్లికార్జున, ఆర్.మునినరేంద్ర, డి.నీలా మహేశ్వరి, ఎస్.స్నేహలత, నాగనవీన రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు నాగేశ్వరరావు, ఖాదర్ రెడ్డి, కుమార్, దిలీప్, కోచ్ అనిల్ పర్యవేక్షించారు.
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్రీడాకారుల ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణానికి చెందిన మై స్పేస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు అకాడమీ డైరెక్టర్ మాస్టర్ సలీం తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో ఫాతిమా, అలోక్య, హసేన్ సత్తా చాటి బంగారు పతకాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. అలాగే క్యాడెట్ విభాగంలో హసేన్, కౌసర్ బంగారు పతకాలు సాధించారన్నారు. ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్లు ఇస్మాయిల్, రియాజ్, సాయికళ్యాణ్ అభినందించారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు