జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన దాసరి పవన్ కుమార్(20) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాష్ నగర్కు చెందిన పవన్కుమార్ ప్రొద్దుటూరు సీబీఐటీ కాలేజ్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పి వస్తుండటంతో ఆ బాధను భరించలేక బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఎద్దు మృతి
కలసపాడు : మండలంలోని ఎగువరామాపురం గ్రామానికి చెందిన ఎనుముల అంకిరెడ్డికి చెందిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృతిచెందింది. బుధవారం అంకిరెడ్డి ఎద్దులను పొలానికి తీసుకెళ్లి ఇంటికి వస్తున్నారు. గ్రామ సమీపంలో కాలువ దాటే క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లిన ఎద్దు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురైన అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఎద్దు విలువ రూ.70వేలు అని రైతు అంకిరెడ్డి తెలిపారు.
యువకుడు అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ (మైలవరం): మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు(32) అదృశ్యమైనట్లు తండ్రి చౌడప్ప మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్యాసుందర్రెడ్డి వివరాల మేరకు.. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు డిగ్రీ పూర్తిచేశాడు. ఇతను ప్రొద్దుటూరు వాస్తు కాంప్లెక్స్లోని నారాయణ స్వామికి చెందిన హర్డ్వేర్ అంగడిలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6వతేదీన ఇంటి నుంచి వెళ్లిన అతడు తరువాత ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ తెలిపారు. అచూకీ తెలిసిన వారు 9121100608 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య