కడప, నెల్లూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

కడప, నెల్లూరు జట్ల విజయం

Jun 12 2025 7:27 AM | Updated on Jun 12 2025 7:27 AM

కడప,

కడప, నెల్లూరు జట్ల విజయం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌–19 వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం వైయస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై కడప జట్టు ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జట్టులోని మురారి హృదయ్‌ 66 పరుగులు చేశారు. కడప జట్టులో నాగ కుల్లాయప్ప నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కడప జట్టు బ్యాటింగ్‌ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు ఓవర్లను కుదించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 37 ఓవర్లలో 164 పరుగుల టార్గెట్‌ నిర్ణయించారు. అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 30.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప జట్టులోని రోహిత్‌ వర్మ 68, రణధీర్‌ రెడ్డి 55 (నాటౌట్‌) పరుగులు చేశారు. విజయం సాధించిన నెల్లూరు జట్టు..

కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై మూడు వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 47.3 ఓవర్లలో 240 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ చెట్టులోని భువనేశ్వర్‌ 63, మనోజ్‌ కుమార్‌ 43 పరుగులు చేశారు. నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు విజేడీ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్‌ 50, మన్విత్‌ 44 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సాయి ప్రతాప్‌ రెడ్డి 3, వీరారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు.

కడప, నెల్లూరు జట్ల విజయం1
1/2

కడప, నెల్లూరు జట్ల విజయం

కడప, నెల్లూరు జట్ల విజయం2
2/2

కడప, నెల్లూరు జట్ల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement